Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన వైఎస్‌ షర్మిల

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను (Bhatti Vikramarka) ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) కలిశారు.

Published : 02 Jul 2024 13:41 IST

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను (Bhatti Vikramarka) ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) కలిశారు. మంగళవారం ఉదయం ప్రజాభవన్‌లోని భట్టి నివాసానికి వెళ్లిన షర్మిల ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి జయంతి వేడుకలకు రావాలని ఆయన్ను షర్మిల ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలుగురాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. 

Tags :

మరిన్ని