Rahul Gandhi: హాథ్రస్ తొక్కిసలాట బాధితులను పరామర్శించిన రాహుల్‌

ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని హాథ్రస్‌లో భోలే బాబా (Bhole Baba) సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

Updated : 05 Jul 2024 15:42 IST

ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని హాథ్రస్‌లో భోలే బాబా (Bhole Baba) సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో బాధిత కుటుంబాలను కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) శుక్రవారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ ఉదయం దిల్లీ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన రాహుల్‌ గాంధీ తొలుత అలీగఢ్‌ చేరుకున్నారు. అక్కడ బాధితుల ఇళ్లకు వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడారు. అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం హాథ్రస్‌ (Hathras) చేరుకుని తొక్కిసలాట బాధితులను పరామర్శించారు.

Tags :

మరిన్ని