TS News: ధన్వంతరి బాధితుల సొమ్ము రికవరీ చేస్తాం: డీసీపీ శ్వేత

ధన్వంతరి ఫౌండేషన్‌ ఇంటర్నేషనల్‌లో నగదు డిపాజిట్‌ చేసి మోసపోయిన బాధితులకు సొమ్ము చేతికి చేరేలా చట్టప్రకారం చర్యలు తీసుకున్నామని నగర సీసీఎస్‌ డీసీపీ శ్వేత తెలిపారు.

Published : 09 Jul 2024 09:51 IST

ధన్వంతరి ఫౌండేషన్‌ ఇంటర్నేషనల్‌లో నగదు డిపాజిట్‌ చేసి మోసపోయిన బాధితులకు సొమ్ము చేతికి చేరేలా చట్టప్రకారం చర్యలు తీసుకున్నామని నగర సీసీఎస్‌ డీసీపీ శ్వేత తెలిపారు. ఈ కేసులో నిందితులు నాలుగు ప్రాంతాల్లో కొనుగోలు చేసిన ఆస్తులను న్యాయస్థానం ఆదేశాలతో జప్తు చేసినట్టు స్పష్టంచేశారు. బషీర్‌బాగ్‌ సీసీఎస్‌ కార్యాలయంలో ధన్వంతరి ఫౌండేషన్‌లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన వారిలో 200 మందితో సీసీఎస్‌ అధికారులు సమావేశం నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న ఆస్తులను విక్రయించడం ద్వారా నిందితులు సేకరించిన డిపాజిట్‌ సొమ్ము రికవరీ అవుతుందన్నారు. బాధితులు అధైర్యపడొద్దన్నారు.

Tags :

మరిన్ని