Gudivada: హారన్‌ కొట్టాడని.. ఆర్టీసీ డ్రైవర్‌పై ఇద్దరు వ్యక్తుల దాడి

హారన్ కొట్టాడని ఆర్టీసీ డ్రైవర్‌పై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 30 Jun 2024 15:24 IST

హారన్‌ కొట్టాడని.. ఆర్టీసీ డ్రైవర్‌పై ఇద్దరు వ్యక్తుల దాడి

కృష్ణా జిల్లా గుడివాడలో ఆర్టీసీ డ్రైవర్‌పై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. హారన్ కొట్టాడని బస్టాండుకు వచ్చి మరీ డ్రైవర్‌పై దాడికి దిగారు. అవనిగడ్డ డిపోకు చెందిన బస్సు.. గుడివాడ బస్టాండు సమీపంలోని కిన్నెర కాంప్లెక్స్ వద్దకు వచ్చింది. రోడ్డు మధ్యలో కారు నిలిపి ఉండటంతో డ్రైవర్ రాకేశ్‌ హారన్ కొట్టారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు హారన్ ఎందుకు కొట్టావంటూ అసభ్య పదజాలంతో డ్రైవర్‌ను దూషించారు. ఆ తర్వాత బస్టాండ్‌కు వచ్చి మరీ డ్రైవర్‌ రాకేశ్‌పై దాడికి పాల్పడ్డారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులను అదుపులోకి తీసుకోలేదని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి.

Tags :

మరిన్ని