Srinivas Varma: ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇచ్చారు: కేంద్ర మంత్రి శ్రీనివాస్‌వర్మ

ప్రత్యేక హోదాలో ఉన్న అంశాలను ప్యాకేజీ ద్వారా కేంద్రం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు అందించిందని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ అన్నారు.

Published : 03 Jul 2024 16:08 IST

ప్రత్యేక హోదాలో ఉన్న అంశాలను ప్యాకేజీ ద్వారా కేంద్రం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు అందించిందని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ అన్నారు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కూటమి ప్రభుత్వాలే ఉన్నందున అన్ని విషయాల్లో కలిసిమెలిసి అడుగులు వేస్తామని శ్రీనివాసవర్మ తెలిపారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని పిలుపు మేరకు దిల్లీలోని ఉద్యోగ భవన్ కార్యాలయం ఆవరణలో శ్రీనివాసవర్మ మొక్క నాటారు.

Tags :

మరిన్ని