Radhakrishnan: విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్

ఏపీ సీఎం చంద్రబాబు తనకు స్నేహితుడని, అందుకే ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్ తెలిపారు.

Updated : 28 Jun 2024 17:46 IST

ఏపీ సీఎం చంద్రబాబు తనకు స్నేహితుడని, అందుకే ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్ తెలిపారు. శుక్రవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ సృజన, దుర్గగుడి ఈవో కె.ఎస్‌.రామారావు, ఇతర అధికారులు ఆయనకు ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు. వేదపండితులు పూర్ణకుంభంతో తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ను ఆహ్వానించారు. దర్శనానంతరం వేదపండితులు రాధాకృష్ణన్‌కు ఆశీర్వచనం చేశారు. సాయంత్రం రాజ్‌భవన్‌లో ఏపీ గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌తో భేటీ కానున్నట్లు రాధాకృష్ణన్‌ వెల్లడించారు.

Tags :

మరిన్ని