TS News: మంత్రివర్గ విస్తరణకు ప్రభుత్వం కసరత్తు

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తైంది. ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చినట్లైతే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఇవాళ దిల్లీకి వెళ్లనున్నారు.

Published : 03 Jul 2024 10:06 IST

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తైంది. ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చినట్లైతే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఇవాళ దిల్లీకి వెళ్లనున్నారు. అధిష్ఠానంతో ఆమోదిస్తే మంత్రివర్గ విస్తరణపై రాత్రికే నిర్ణయం ప్రకటించి.. రేపు ప్రమాణస్వీకారం చేయించే అవకాశం ఉంది. ఈ విస్తరణలో నలుగురికి మంత్రిపదవులు దక్కే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి.

Tags :

మరిన్ని