AP News: ప్రజల నుంచి వినతుల స్వీకరణకు టోల్‌ఫ్రీ నంబర్‌: తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా

ప్రజల నుంచి వినతుల స్వీకరణకు కొత్తగా టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) తెలిపారు.

Updated : 30 Jun 2024 18:17 IST

ప్రజల నుంచి వినతుల స్వీకరణకు కొత్తగా టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎంకు వినతులు ఇచ్చేందుకు జనం పొటెత్తుతున్నారని చెప్పారు. వారు వినతుల స్వీకరణ సులభతరం చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రజలు వారి సమస్యలను 73062 99999 నంబర్‌కు ఫోన్‌ చేసి తెలియజేస్తే.. ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Tags :

మరిన్ని