Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల (Tirumala) శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

Published : 02 Jul 2024 19:02 IST

తిరుమల (Tirumala) శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విక్రమ్ నాథ్, జస్టిస్‌ ప్రశాంత్ కుమార్ మిశ్రా, కాంగ్రెస్‌ నేత మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే రోహిత్‌ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Tags :

మరిన్ని