TG News: మాస్టారు బదిలీ.. కన్నీటిపర్యంతమైన విద్యార్థులు

విద్యా బుద్ధులు నేర్పించిన మాస్టారు బదిలీ అవడంతో విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు.

Published : 29 Jun 2024 13:38 IST

విద్యా బుద్ధులు నేర్పించిన మాస్టారు బదిలీ అవడంతో విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం చిలకపురం ప్రాథమిక పాఠశాలలో సైదులు 11 ఏళ్లుగా ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఇటీవల సైదులుకి బదిలీ కావడంతో.. విద్యార్థులు, సిబ్బంది తట్టుకోలేకపోయారు. మమ్మల్ని వదలి పెట్టి వెళ్లొద్దంటూ ఏడ్చారు. సైదులుకి గతంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా రావడం విశేషం

Tags :

మరిన్ని