TG News: మా పాఠశాలకు టీచర్లను నియ‌మించండి.. రోడ్డెక్కిన విద్యార్థులు

మెదక్ జిల్లాలో చిన్న శంకరం పేట గ్రామంలోని శాలిపేట ప్రభుత్వ పాఠశాలలో తగినంత మంది ఉపాధ్యాయులు కావాలని విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు.

Updated : 28 Jun 2024 13:49 IST

మెదక్ జిల్లాలో చిన్న శంకరం పేట గ్రామంలోని శాలిపేట ప్రభుత్వ పాఠశాలలో తగినంత మంది ఉపాధ్యాయులు కావాలని విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కారు. గవలపల్లి- రామాయంపేట రోడ్డుపై శాలిపేట వద్ద రోడ్డుపైనే వంట, వార్పు చేస్తూ నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు వచ్చే వరకు రోడ్డుపై నుంచి జరిగేది లేదంటూ బైఠాయించారు. శాలిపేట పాఠశాలలో ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే ఉన్నారని.. విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు లేరని వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. 

Tags :

మరిన్ని