Bhuvanagiri: మాస్టారు బదిలీ.. కన్నీటిపర్యంతమైన విద్యార్థులు

బదిలీపై వేరే పాఠశాలకు వెళుతున్న గురువును చూసి విద్యార్థులు భావోద్వేగానికి గురైన ఘటన భువనగిరి జిల్లా మోత్కూరు మండలం కొండగడపలో చోటుచేసుకుంది.

Updated : 02 Jul 2024 12:38 IST

బదిలీపై వేరే పాఠశాలకు వెళుతున్న గురువును చూసి విద్యార్థులు భావోద్వేగానికి గురైన ఘటన భువనగిరి జిల్లా మోత్కూరు మండలం కొండగడపలో చోటుచేసుకుంది. ఇన్నాళ్లు తమ ఉన్నతి కోసం పరితపించి తరగతి పాఠాలే కాదు.. జీవిత పాఠాలు బోధించిన ఉపాధ్యాయుడి చుట్టూ చేరి తమను వీడి వెళ్లిపోవద్దంటూ వెక్కివెక్కి ఏడ్చారు. 11 ఏళ్లపాటు ఉపాధ్యాయుడు హనుమంతు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. పిల్లలంతా బడిలో చేరేలా ప్రోత్సహించారంటూ స్థానికులు కొనియాడారు. పిల్లల ప్రేమానురాగాలు చూసి తను ఉద్వేగానికి గురయ్యారు గురవు హనుమంతు.

Tags :

మరిన్ని