TG News: ఉపాధ్యాయుల బదిలీ.. కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు

నిర్మల్ జిల్లా మామడ మండలం ఆరెపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో అరుదైన ఘటం చోటుచేసుకుంది.

Published : 04 Jul 2024 12:45 IST

నిర్మల్ జిల్లా మామడ మండలం ఆరెపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో అరుదైన ఘటం చోటుచేసుకుంది. పాఠశాలలో ఏళ్లుగా విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులు శిరీష్ కుమార్, ప్రకాష్ రావు, శ్రీకర్ బదిలీపై వేరొక చోటు వెళ్తున్న సందర్భంగా.. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు భావోద్వేగానికి గురై మీరు మరో చోటుకు వెళ్లొద్దు ఇక్కడే ఉండాలంటూ బోరున విలపించారు. వారికి ఉపాధ్యాయులంతా కలిసి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి ప్రాథమిక పాఠశాలలో వినీత అనే ఉపాధ్యాయురాలు 12 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా బదిలీపై మరో పాఠశాలకు వెళ్లనున్నారు. విషయం తెలిసి విద్యార్థులు భావోద్వేగానికి గురై తమను విడిచి వెళ్లొద్దంటూ కంటతడి పెట్టుకున్నారు. 

Tags :

మరిన్ని