Eatala: తెలంగాణ సమస్యలను కేంద్రమంత్రికి వివరించాం: ఈటల

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని రోడ్ల పనుల్లో వేగం పెంచాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు.

Published : 28 Jun 2024 18:57 IST

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని రోడ్ల పనుల్లో వేగం పెంచాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఈ మేరకు దిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన ఈటల.. కొంపల్లి ఫ్లై ఓవర్, అండర్‌పాస్, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, శామీర్ పేట రోడ్డు, ఎల్బీనగర్‌ అండర్‌పాస్, హుజూరాబాద్ రోడ్డు సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. వీటి నిర్మాణంలో ఉన్న సమస్యలు పరిష్కరించి పనుల్లో వేగంగా పెంచాలన్న విజ్ఞప్తికి.. గడ్కరీ సానుకూలంగా స్పందించారని ఈటల అన్నారు.

Tags :

మరిన్ని