Kurnool: సమస్యలు పరిష్కరించాలంటూ సిల్వర్ జూబ్లీ కళాశాల విద్యార్థుల ఆందోళన

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు.

Updated : 05 Jul 2024 17:51 IST

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కర్నూలు జిల్లాలోని సిల్వర్ జూబ్లీ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు. కళాశాల వసతి గృహంలో నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థులు వాపోయారు. కనీస వసతులు కల్పించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా స్పందించటం లేదన్నారు. తక్షణమే అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కారించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

Tags :

మరిన్ని