Smriti Mandhana: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్మృతి మంధాన

తిరుమల శ్రీవారిని భారత క్రికెటర్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) దర్శించుకున్నారు.

Updated : 02 Jul 2024 15:24 IST

తిరుమల శ్రీవారిని భారత క్రికెటర్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో స్మృతికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Tags :

మరిన్ని