Srikakulam: రసాయన పరిశ్రమలో రియాక్టర్‌ పేలుడు.. భారీగా మంటలు

శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలోని రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించింది. సరకా ల్యాబొరేటరీస్‌లో రియాక్టర్‌ పేలడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.

Published : 29 Jun 2024 16:02 IST

రసాయన పరిశ్రమలో రియాక్టర్‌ పేలుడు.. భారీగా మంటలు

శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలోని రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించింది. సరకా ల్యాబొరేటరీస్‌లో రియాక్టర్‌ పేలడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. పరిశ్రమ ప్రాంగణంలో ఉన్న పలు వాహనాలకు మంటలు అంటుకొని దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

మరిన్ని