KTR: పాఠ్యపుస్తకాల్లో పీవీ జీవిత చరిత్రను చేర్చాలి: కేటీఆర్

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవితచరిత్రను కేంద్రం ఎన్‌సీఆర్‌సీ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు.

Published : 28 Jun 2024 15:31 IST

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవితచరిత్రను కేంద్రం ఎన్‌సీఆర్‌సీ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. పీవీ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయనకు నివాళి అర్పించారు. భారతదేశం ఉన్నన్ని రోజులు పీవీ పేరును దేశ ప్రజలు గుర్తుంచుకుంటారని కేటీఆర్ అన్నారు. భారాస (BRS) హయాంలో పీవీ శతజయంతి ఉత్సవాలు అపురూపంగా నిర్వహించామని చెప్పారు.

Tags :

మరిన్ని