Purandeswari: ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్‌.. నీతులు వల్లించడం హాస్యాస్పదం: పురందేశ్వరి

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) సోమవారం లోక్‌సభలో చేసిన  వ్యాఖ్యలను భాజపా ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి (Purandeswari) తీవ్రంగా ఖండించారు.

Updated : 02 Jul 2024 13:42 IST

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) సోమవారం లోక్‌సభలో చేసిన ప్రసంగం  తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను భాజపా ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి (Purandeswari) తీవ్రంగా ఖండించారు. హిందువుల మనోభావాలను రాహుల్ గాంధీ దెబ్బ తీశారని మండిపడ్డారు. దేశంలో ఎమర్జెన్సీని విధించిన కాంగ్రెస్ పార్టీ నీతులు వల్లించడం హాస్యాస్పదమన్నారు. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Tags :

మరిన్ని