Kodandaram: విభజన హామీల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ చాలా అవసరం: ప్రొ.కోదండరాం

విభజన హామీల పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ చాలా అవసరమని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం (Kodandaram) అభిప్రాయపడ్డారు.

Updated : 02 Jul 2024 20:33 IST

విభజన హామీల పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ చాలా అవసరమని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం (Kodandaram) అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల విభజన, పబ్లిక్‌ రంగ సంస్థల విభజనకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం దోహదం చేస్తుందన్నారు. ఉద్యోగుల పంపిణీ, జలవనరుల సమస్యలకు ఈ సమావేశం ద్వారా పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన జగన్‌, కేసీఆర్‌ భేటీలు రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప సమస్యల పరిష్కారం కోసం కాదని విమర్శించారు. ఇరు రాష్ట్రాల ప్రజలకు నష్టం జరగకుండా అపరిష్కృత విభజన హామీలను పరిష్కరించాలని కోదండరాం కోరారు.

Tags :

మరిన్ని