Team India: భారత క్రికెటర్లతో ప్రధాని మోదీ.. పూర్తి వీడియో

టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుతో (Team India) ప్రధాని మోదీ ముచ్చటించారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియోను చూసేయండి.

Updated : 05 Jul 2024 17:15 IST

టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు (Team India) ప్రధాని మోదీ ఆతిథ్యమిచ్చారు. గురువారం తన నివాసంలో రోహిత్‌శర్మ సేనతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. సుమారు 2 గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో ప్రధాని ఆటగాళ్లతో ముచ్చటించారు. పొట్టి కప్పులో ఆటగాళ్ల మధురానుభూతుల్ని అడిగి తెలుసుకున్నారు. కప్పు గెలిచిన తర్వాత పిచ్‌ దగ్గర మట్టిని తిన్న రోహిత్‌ను ‘రుచి ఎలా ఉంది?’ అంటూ ప్రధాని వాకబు చేశారు. ఫామ్‌తో ఇబ్బంది పడిన కోహ్లి.. ఫైనల్‌కు తాను ఎలాంటి మనస్తత్వంతో ఉన్నాడో చెబుతుంటే ఆసక్తిగా విన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియోను చూసేయండి.

Tags :

మరిన్ని