వైకాపా హయాంలో జీజీహెచ్‌ అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది: కేంద్ర మంత్రి పెమ్మసాని

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని.. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

Published : 29 Jun 2024 16:52 IST

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని.. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. జీజీహెచ్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో పెమ్మసాని సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఎమ్మెల్యేలు రామాంజనేయులు, గళ్లా మాధవి, కలెక్టర్ నాగలక్ష్మి, వైద్యాధికారులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తామని పెమ్మసాని వెల్లడించారు. ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి జీజీహెచ్‌లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు.

Tags :

మరిన్ని