Hyderabad: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థిసంఘాలు

నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ హైదరాబాద్ కాచిగూడలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటి ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

Published : 22 Jun 2024 12:44 IST

నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ హైదరాబాద్ కాచిగూడలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటి ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి ఇంటిని విద్యార్థిసంఘాల నేతలు ముట్టడించారు. జాతీయస్థాయి వైద్యవిద్య ప్రవేశపరీక్షలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ.. నీట్ ఛైర్మన్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేస్తున్న బల్మూరి వెంకట్ సహా విద్యార్థిసంఘాల నాయకులను నల్లకుంట ఠాణాకు తరలించారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం తక్షణం స్పందించి నీట్‌పై దిద్దుబాటు చర్యలు చేపట్టాలని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు.

Tags :

మరిన్ని