Nadendla Manohar: రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా ఆఫ్రికన్‌ దేశాలకు తరలిస్తున్నారు: మంత్రి నాదెండ్ల

కాకినాడ పోర్టును వైకాపా నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ఆక్రమించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆరోపించారు.

Published : 29 Jun 2024 17:15 IST

కాకినాడ పోర్టును వైకాపా నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం ఆక్రమించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ఆరోపించారు. రేషన్ మాఫియా పనిపట్టేందుకు కాకినాడలో రెండ్రోజులుగా మకాం వేసిన నాదెండ్ల.. అశోక ఇంటర్నేషనల్ గోదామును పరిశీలించారు. 5300 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చెయ్యాలని ఆదేశించారు. రేషన్‌ బియ్యాన్ని ఆఫ్రికన్‌ దేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. రేషన్ బియ్యం అక్రమాలపై తనిఖీలు ముగిసే వరకూ ఎగుమతులు నిలిపివేస్తామని, ఈ కేసును సీఐడీకి అప్పగిస్తామని నాదెండ్ల తెలిపారు.

Tags :

మరిన్ని