Padi Kaushik: కరీంనగర్‌ డీఈఓను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్‌

కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది. నియోజకవర్గంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష పెట్టుకొనే హక్కు లేదా అంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. జిల్లా విద్యాధికారి జనార్ధన్‌ను నిలదీశారు.

Published : 02 Jul 2024 19:11 IST

కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది. నియోజకవర్గంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష పెట్టుకొనే హక్కు లేదా అంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. జిల్లా విద్యాధికారి జనార్ధన్‌ను నిలదీశారు. తన సమీక్షకు హాజరైన వారికి నోటీస్ ఇవ్వడం పట్ల కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ప్రి విలేజ్ మోషన్ పెడతానని చెప్పడంతో గందరగోళం ఏర్పడింది. దళితబంధు అంశంతో పాటు జిల్లా విద్యాధికారి అంశం పై కలెక్టర్ పమేలా సత్పతి సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేయడంతో.. అక్కడి నుంచి కలెక్టర్ వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. కలెక్టర్ వెళ్లకుండా అడ్డుకునేందుకు మెట్ల పై బైఠాయించారు. ఆ తర్వాత డీఈఓను సస్పెండ్ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.

Tags :

మరిన్ని