Ponnam Prabhakar: విభజన హామీల అమలు కోసం తెలుగు రాష్ట్రాలు కలిసి రావాలి: మంత్రి పొన్నం

విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి రావాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కోరారు.

Published : 30 Jun 2024 15:43 IST

విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి రావాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కోరారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శనంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఏపీలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు‌‌. ప్రభుత్వం తరఫున ఏపీ డిప్యూటీసీఎం పవన్‌కల్యాణ్‌కు కొండగట్టులో స్వాగతం పలికామని చెప్పారు. గతంలో తిరుమలలో తెలంగాణ భక్తులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. తెలంగాణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తితిదేను కోరారు‌. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు