Ponnam: రైతులకు ఏ సమస్య వచ్చినా నా వద్దకు రండి: మంత్రి పొన్నం

రైతులకు నిజాయితీగా సేవలందిస్తే రాజకీయంగా ఎదుగుతామనే దానికి తానే ప్రత్యేక ఉదాహరణ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Updated : 29 Jun 2024 13:18 IST

రైతులకు నిజాయితీగా సేవలందిస్తే రాజకీయంగా ఎదుగుతామనే దానికి తానే ప్రత్యేక ఉదాహరణ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. తన రాజకీయ జీవితం సింగిల్ విండో డైరెక్టర్‌గా ప్రారంభమయ్యిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేడీసీసీ ఛైర్మన్ కొండూరి రవీందర్ రావు మంత్రిని సన్మానించారు. రైతులు ఎవరైనా తమకు సమస్య వస్తే తనను మంత్రిగా కాకుండా సింగిల్ విండో ఛైర్మెన్‌గా భావించి తన వద్దకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.      

Tags :

మరిన్ని