Parthasarathi: జగన్‌ ఏకపక్ష నిర్ణయాలతో ఏపీ పూర్తిగా నష్టపోయింది: మంత్రి పార్థసారథి

జగన్ ఏకపక్ష నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని మంత్రి కొలుసుపార్థసారథి (Parthasarathi) ఆరోపించారు.

Updated : 30 Jun 2024 16:54 IST

జగన్ ఏకపక్ష నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని మంత్రి కొలుసుపార్థసారథి (Parthasarathi) ఆరోపించారు. రాష్ట్రాన్ని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందన్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మంత్రి పార్థసారథి మొక్కులు చెల్లించుకున్నారు.

Tags :

మరిన్ని