Ramprasad Reddy: జగన్‌ తర్వాత అత్యధిక అక్రమార్జన పెద్దిరెడ్డిదే..!: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పుంగనూరును మాఫియా రాజ్యంగా మార్చేసిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad reddy) ధ్వజమెత్తారు.

Updated : 01 Jul 2024 19:14 IST

మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పుంగనూరును మాఫియా రాజ్యంగా మార్చేసిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad reddy) ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వం పోవడంతో పీడవిరగడైందని పుంగనూరు ప్రజలు ప్రశాంతంగా ఉంటే.. అక్కడికెళ్లి రచ్చ చేయాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘జగన్‌ తర్వాత అత్యధిక అక్రమార్జన చేసింది ఆయనే. 1985-90 మధ్య పెద్దిరెడ్డిది సామాన్య కుటుంబం. వైకాపాకు ఆయన కుటుంబం రూ.వేల కోట్లు సమకూర్చింది. రాష్ట్రంలోని ఖనిజాలను పెద్దిరెడ్డే తవ్వేశారు. రాష్ట్రంలో 10వేల ఎకరాలు దోచేశారు. పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలన్నీ బయటపెడతాం’’ అని మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

మరిన్ని