Jagitial: భార్య జ్ఞాపకార్థం గుడి కట్టించిన భర్త

నిత్యం తోడుగా ఉన్న భార్య తిరిగిరాని లోకాలకు వెళ్లిందని ఆమె జ్ఞాపకార్థంగా ఓ భర్త గుడి కట్టించాడు.

Published : 16 Jun 2024 15:36 IST

నిత్యం తోడుగా ఉన్న భార్య తిరిగిరాని లోకాలకు వెళ్లిందని ఆమె జ్ఞాపకార్థంగా ఓ భర్త గుడి కట్టించాడు. జగిత్యాల జిల్లా మ్యాడంపల్లికి చెందిన దుబయ్యకు ముత్యంపేటకు చెందిన బుచ్చమ్మతో చిన్నతనంలోనే వివాహమైంది. వీరికి సంతానం లేనప్పటికీ, దంపతులిద్దరూ అన్యోన్యంగా జీవించారు. దుబాయ్ వెళ్లి వచ్చి ఇంటి వద్దే స్థిరపడిన దుబ్బయ్య పొలం పనులు చూసుకునే వాడు. అయితే ఏడాది క్రితం భార్య బుచ్చమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. దుబ్బయ్య ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దాంతో భార్యకు గుడికట్టాలని నిర్ణయించి తన మామిడితోటలోనే ప్రత్యేకంగా నిర్మించిన గదిలో బుచ్చమ్మ సమాధిని కట్టారు. 

Tags :

మరిన్ని