Madhavi: అక్రమ నిర్మాణాలను ఖాళీ చేయాలి.. వైకాపా కార్పొరేటర్‌కు ఎమ్మెల్యే మాధవి హెచ్చరిక

కడప నగరంలోని 34వ డివిజన్‌లో వైకాపా కార్పొరేటర్ ఆక్రమించుకున్న స్థలాన్ని వారం రోజుల్లో ఖాళీ చేయకపోతే బుల్డోజర్‌తో కూల్చేస్తామని తెదేపా ఎమ్మెల్యే మాధవి హెచ్చరించారు.

Published : 29 Jun 2024 12:50 IST

కడప నగరంలోని 34వ డివిజన్‌లో వైకాపా కార్పొరేటర్ ఆక్రమించుకున్న స్థలాన్ని వారం రోజుల్లో ఖాళీ చేయకపోతే బుల్డోజర్‌తో కూల్చేస్తామని తెదేపా ఎమ్మెల్యే మాధవి హెచ్చరించారు. నగర పర్యటనలో భాగంగా 34వ డివిజన్‌కి ఎమ్మెల్యే వెళ్లారు. ఆ ప్రాంతంలో రోడ్డు పక్కనే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వైకాపా కార్పొరేటర్ అక్బర్ నిర్మించుకున్న కార్యాలయ ప్రదేశాన్ని ఎమ్మెల్యే మాధవి పరిశీలించారు. వారం రోజుల్లో కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సిబ్బందికి సూచించారు. పక్కనే ఉన్న మరో గదికి వైఎస్ అవినాష్‌రెడ్డి పేరు పెట్టడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమంగా కాజేసి వైకాపా కార్పొరేటర్లు సొంత కార్యాలయాలుగా నిర్మించుకొని ఐదేళ్లు పాలన సాగించారని ఆమె మండిపడ్డారు. 

Tags :

మరిన్ని