Assam Flood: నీట మునిగిన కజిరంగా నేషనల్‌ పార్క్‌.. వన్యప్రాణులు మృతి

అసోంలో బ్రహ్మపుత్ర దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి కజిరంగా జాతీయ పార్కు, టైగర్ రిజర్వ్ కేంద్రాలు వరద నీటిలో మునిగిపోయాయి.

Published : 03 Jul 2024 20:29 IST

అసోంలో బ్రహ్మపుత్ర దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. 23 జిల్లాలోని 11,50,000 మందిపై వరద ప్రభావం పడింది. 2,90,000 మంది 490 పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. కజిరంగా జాతీయ పార్కు, టైగర్ రిజర్వ్ కేంద్రాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఒక రైనో సహా 8 జంతువులు మృతి చెందాయని అటవీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో రెండో విడత వరదలకు అరుణాచల్‌ప్రదేశ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌ కారణమని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు.

Tags :

మరిన్ని