congress: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు

సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Published : 03 Jul 2024 17:01 IST

సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బుధవారం దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్‌ మున్షీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేకే కుమార్తె, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి గతంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

Tags :

మరిన్ని