Jio - Airtel: టారిఫ్‌లను పెంచిన జియో, ఎయిర్‌టెల్‌

ప్రముఖ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్‌ తమ వినియోగదారుల జేబుకు చిల్లుపడే నిర్ణయాలు తీసుకున్నాయి.

Published : 28 Jun 2024 16:56 IST

ప్రముఖ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్‌ తమ వినియోగదారుల జేబుకు చిల్లుపడే నిర్ణయాలు తీసుకున్నాయి. గురువారం జియో తన టారిఫ్‌లపై 12.5 శాతం నుంచి 25 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించగా.. తాజాగా ఎయిర్‌టెల్‌ కూడా అదేబాటలో నడిచింది. ఈ మేరకు తమ టారిఫ్‌లపై 10 నుంచి 21 శాతం ధరలు పెంచనున్నట్లు ఎయిర్‌టెల్‌ నిర్ణయం తీసుకుంది. రెండు సంస్థలు పెంచిన నూతన ధరలు జులై 3 నుంచి అమల్లోకి రానున్నాయి.

Tags :

మరిన్ని