T20 World Cup: టీ-20 ప్రపంచకప్ ఫైనల్‌.. భారత్‌ విజయం కోసం అభిమానుల పూజలు

టీ-20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ దేశవ్యాప్తంగా అభిమానులు పూజలు నిర్వహించారు.

Published : 29 Jun 2024 19:20 IST

టీ-20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ దేశవ్యాప్తంగా అభిమానులు పూజలు నిర్వహించారు. ముంబయిలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయంలో అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేరిట అర్చన చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో టీమిండియా గెలవాలని హోమం చేశారు. విరాట్  కోహ్లీ, రోహిత్ చిత్రాలను అమ్మవారి వద్ద పెట్టి పూజ నిర్వహించారు. గోరఖ్‌పుర్‌లోని ఆంజనేయ స్వామి దేవాలయంలోనూ భారత జట్టు గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ చాలీసా పఠించారు. ఈసారి భారత్‌ టీ-20 ప్రపంచకప్ గెలవడం ఖాయమని అభిమానులు విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని