Anitha: ఏపీలో గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు: మంత్రి అనిత

ఖైదీలకు కల్పించే క్షమాభిక్షను సైతం వైకాపా ప్రభుత్వం ఐదేళ్లుగా విస్మరించిందని హోంమంత్రి అనిత అన్నారు.

Published : 02 Jul 2024 19:54 IST

ఖైదీలకు కల్పించే క్షమాభిక్షను సైతం వైకాపా ప్రభుత్వం ఐదేళ్లుగా విస్మరించిందని హోంమంత్రి అనిత అన్నారు. విశాఖలోని కేంద్ర కారాగారాన్ని మంత్రి సందర్శించారు. ఖైదీల స్థితిగతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాలపై ఆరా తీశారు. జైళ్ల శాఖలో పనిచేసే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని అనిత హామీ ఇచ్చారు. గంజాయిని అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని