Nandamuri Balakrishna: లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర

హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలం దేమకేతే పల్లి, లేపాక్షి మండలం చోళసముద్రం గ్రామాల్లో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర పాల్గొన్నారు.

Published : 01 Jul 2024 18:08 IST

హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలం దేమకేతే పల్లి, లేపాక్షి మండలం చోళసముద్రం గ్రామాల్లో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర పాల్గొన్నారు. ఆమె స్వయంగా ఇటంటికీ వెళ్లి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్‌ సొమ్మును అందజేశారు. పింఛన్ల పంపిణీ కోసం విచ్చేసిన వసుంధరకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. స్వర్గీయ ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వసుంధర విలేకరులతో మాట్లాడారు.

Tags :

మరిన్ని