హిమాచల్‌ను వణికిస్తోన్న వానలు.. రహదారి శిథిలాల్లో చిక్కుకున్న 3 వాహనాలు

హిమాచల్ ప్రదేశ్‌లోని శిమ్లాలో మూడు వాహనాలు వరదకు కొట్టుకువచ్చిన రహదారి శిథిలాల్లో చిక్కుకుపోయాయి.

Published : 28 Jun 2024 20:09 IST

హిమాచల్ ప్రదేశ్‌లోని శిమ్లాలో మూడు వాహనాలు వరదకు కొట్టుకువచ్చిన రహదారి శిథిలాల్లో చిక్కుకుపోయాయి. చామియానా ప్రాంతంలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు  2 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వరద పోటెత్తడంతో నిర్మాణంలో ఉన్న 4లైన్ల రహదారి కొట్టుకుపోయింది. నిలిపి ఉంచిన వాహనాలు ఆ శిథిలాల్లో చిక్కుకుపోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. తమ ఇళ్లు కూడా అలాగే కొట్టుకుపోతాయని భయపడుతున్నారు. మరోవైపు.. గతేడాది కన్నా ఈసారి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్న నేపథ్యంలో తమకు మరింత ప్రమాదం పొంచి ఉందని హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

మరిన్ని