Pawan Kalyan: ప్రజాసేవలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌!

ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గురుకుల పాఠశాలల్లోని ఒప్పంద ఉపాధ్యాయులు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

Published : 29 Jun 2024 10:38 IST

ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గురుకుల పాఠశాలల్లోని ఒప్పంద ఉపాధ్యాయులు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. గురుకుల పాఠశాలల్లో 1500లకు పైగా ఉపాధ్యాయులు ఉన్నారని వారంతా చాలీచాలని జీతంతో నెట్టుకొస్తున్నారని చెప్పారు. ఎలాంటి సంక్షేమ పథకాలూ అందట్లేదని తెలిపారు. మెగా డీఎస్సీలో తమ పోస్టులను కలిపేయడంతో అన్యాయం జరుగుతోందని ప్రభుత్వం తమ పోస్టులను మినహాయించాలని అభ్యర్థించారు. సానుకూలంగా స్పందించిన పవన్ ప్రభుత్వంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన బాధితుల్ని కలుసుకున్న పవన్ వారి నుంచి వినతిపత్రాలు తీసుకుని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. 

Tags :

మరిన్ని