Hyderabad: పామును ఎమ్మెల్యే ముందు ఉంచి.. సమస్యలను వివరించిన స్థానికులు

సికింద్రాబాద్ అడ్డగుట్టలోని గంగపుత్ర సంఘం సమీపంలో ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు.

Published : 02 Jul 2024 13:18 IST

సికింద్రాబాద్ అడ్డగుట్టలోని గంగపుత్ర సంఘం సమీపంలో ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. నిర్మాణ సామగ్రి, చెత్త చెదారం వల్ల పాముల బెడదను ఎదుర్కొంటున్నామని వివరించారు. ఈ సందర్భంగా వారు పట్టుకున్న పామును ఎమ్మెల్యే ముందు ఉంచి ఇబ్బందులను ఏకరువు పెట్టారు. స్పందించిన పద్మారావు గౌడ్ జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించి 24 గంటల్లో సమస్యలను పరిష్కరించాలని కోరారు. పాములు సంచరించకుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు.

Tags :

మరిన్ని