Gautam Gambhir: కోహ్లీ, రోహిత్ టీ20 రిటైర్మెంట్‌.. ఇంతకంటే మంచి సందర్భం ఏం ఉంటుంది?: గౌతమ్ గంభీర్

భారత ప్రజలు గర్వించేలా టీమ్‌ఇండియా టీ20 ప్రపంచ కప్‌ను గెలిచిందని మాజీ క్రికెటర్‌ గౌతమ్ గంభీర్ అన్నారు. ఆదివారం వీఐపీ విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.

Updated : 30 Jun 2024 13:38 IST

భారత ప్రజలు గర్వించేలా టీమ్‌ఇండియా టీ20 ప్రపంచ కప్‌ను గెలిచిందని మాజీ క్రికెటర్‌ గౌతమ్ గంభీర్ అన్నారు. ఆదివారం వీఐపీ విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, రాహుల్ ద్రావిడ్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్‌పై గంభీర్ స్పందించారు. టీ20 కప్ గెలవడం కంటే రిటైర్మెంట్‌కు మంచి సందర్భం ఏం ఉంటుందన్నారు. వన్డే, టెస్ట్‌లలో జట్టుకు వారిద్దరూ విలువైన సేవలు అందిస్తారని గంభీర్‌ తెలిపారు.

Tags :

మరిన్ని