ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే క్యాన్సర్‌ను 98 శాతం నివారించొచ్చు: నోరి దత్తాత్రేయ

ప్రాథమిక స్థాయిలోనే క్యాన్సర్‌ను గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే 98శాతం నయం అవుతుందని ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణుడు నోరి దత్తాత్రేయుడు అన్నారు.

Updated : 02 Jul 2024 15:25 IST

ప్రాథమిక స్థాయిలోనే క్యాన్సర్‌ (Cancer)ను గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే 98శాతం నయం అవుతుందని ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణుడు నోరి దత్తాత్రేయుడు(Nori Dattatreyudu) అన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో దైనందిన జీవితాన్ని కొనసాగించవచ్చని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని జీఎస్ఎ‌ల్‌ వైద్యకళాశాల, జనరల్ ఆసుపత్రిలో డాక్టర్స్‌ డే సందర్భంగా.. సోమవారం నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆయన ఈటీవీతో మాట్లాడారు. వంశపారంపర్య లక్షణాలు, రోజుల తరబడి తగ్గని వ్యాధులను గుర్తించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Tags :

మరిన్ని