Hyderabad: భారత్‌ విజయం.. తెలంగాణ సచివాలయం ఎదుట క్రికెట్ అభిమానుల సంబరాలు

టీమ్‌ఇండియా టీ20 ప్రపంచ కప్ గెలుపొందడంతో భాగ్యనగరంలో క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన వెంటనే పెద్ద ఎత్తున యువత ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు.

Published : 30 Jun 2024 08:48 IST

టీమ్‌ఇండియా టీ20 ప్రపంచ కప్ గెలుపొందడంతో భాగ్యనగరంలో క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన వెంటనే పెద్ద ఎత్తున యువత ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. దీంతో అబిడ్స్, చిక్కడపల్లి, అశోక్ నగర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, కూకట్‌పల్లి, మాదాపూర్, సచివాలయం, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ‘భారత మాతకు జై’ అంటూ నినాదాలు, కేరింతలు కొడుతూ జాతీయ జెండా చేతపట్టుకొని ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ సందడి చేశారు.

Tags :

మరిన్ని