Revanth Reddy: డ్రగ్స్ కట్టడిపై తెలుగు సినీ పరిశ్రమ అవగాహన కల్పించాలి: సీఎం రేవంత్‌రెడ్డి

సైబర్‌ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై తెలుగు సినీ పరిశ్రమ అవగాహన కల్పించాలని సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) సూచించారు. దీనికి సంబంధించిన వీడియోలను థియేటర్‌లలో కచ్చితంగా ప్రదర్శించాలన్నారు.

Published : 02 Jul 2024 16:11 IST

సైబర్‌ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై తెలుగు సినీ పరిశ్రమ అవగాహన కల్పించాలని సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) సూచించారు. దీనికి సంబంధించిన వీడియోలను థియేటర్‌లలో కచ్చితంగా ప్రదర్శించాలన్నారు. అలా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతులు జారీ చేస్తామన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టీజీ న్యాబ్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు ప్రముఖ సినీనటుడు చిరంజీవి ముందుకొచ్చి ఓ వీడియోను రికార్డు చేసి పంపించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Tags :

మరిన్ని