CM Revanthreddy: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో డీఎస్‌ కీలకపాత్ర పోషించారు: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ధర్మపురి శ్రీనివాస్ కీలకపాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వెల్లడించారు. నిజామాబాద్‌లో డీఎస్‌ పార్ధివదేహానికి సీఎం రేవంత్‌ నివాళులర్పించారు.

Published : 30 Jun 2024 16:03 IST

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ధర్మపురి శ్రీనివాస్ కీలకపాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వెల్లడించారు. నిజామాబాద్‌లో డీఎస్‌ పార్ధివదేహానికి సీఎం రేవంత్‌ నివాళులర్పించారు. ఎంతో మంది బలహీన వర్గాల నాయకులను డీఎస్‌ గుర్తించి అవకాశాలిచ్చారని కొనియాడారు. నిజామాబాద్ అభివృద్ధిపై డీఎస్‌ చెరగని ముద్ర వేశారని షబ్బీర్ అలీ అన్నారు. బ్యాంకు ఉద్యోగాన్ని సైతం వదులుకొని ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారని వి.హనుమంతరావు తెలిపారు. అధికారిక లాంఛనాలతో డీఎస్‌ అంత్యక్రియలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించగా అభిమానులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య అంతిమ యాత్ర కొనసాగింది.

Tags :

మరిన్ని