Andhra University: ఏయూలో మళ్లీ పూర్వ పరిస్థితులు తీసుకొస్తాం: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

వీసీ ప్రసాదరెడ్డి రాజీనామాతో ఆంధ్రా వర్సిటీలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ఏయూలో మళ్లీ పూర్వ పరిస్థితులు రప్పిస్తామని తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు.

Published : 29 Jun 2024 16:45 IST

ఏయూలో మళ్లీ పూర్వ పరిస్థితులు రప్పిస్తామని తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. యూనివర్సిటీలో అనేక అక్రమాలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు పెట్టారని ఆరోపించారు. వీసీ ప్రసాదరెడ్డి రాజీనామాతో ఆంధ్రా వర్సిటీలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. భాజపా ఎంపీ సి.ఎం. రమేశ్‌, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఏయూలో విద్యార్థుల అభివృద్ధికి దోహదపడే పాలకవర్గం ఉంటుందని సి.ఎం.రమేశ్‌ తెలిపారు. విశ్వవిద్యాలయంలో జరిగిన అవినీతిపై న్యాయవిచారణ చేయిస్తామన్నారు. 

Tags :

మరిన్ని