CM Revanth: కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనలకు సిద్ధమయ్యారు. త్వరలో వారానికి ఒక జిల్లాలో పర్యటించి.. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. జిల్లా కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని ఆదేశించారు.

Published : 03 Jul 2024 11:41 IST

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనలకు సిద్ధమయ్యారు. త్వరలో వారానికి ఒక జిల్లాలో పర్యటించి.. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. జిల్లా కలెక్టర్లు చాలా వరకు కార్యాలయాలకే పరిమితం అవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారులు కూడా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని ఆదేశించారు. వారానికి ఓ కొత్త ఆలోచనను ప్రభుత్వానికి నివేదించాలన్నారు. 

Tags :

మరిన్ని