Chandrababu-Lokesh: సీబీఎన్‌ 4.0.. 1995 నాటి సీఎంను చూస్తారు!: లోకేశ్‌తో చంద్రబాబు ఆసక్తికర సంభాషణ

గతంలో పరదాల సీఎంను మనం చూశామని.. ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు. పింఛన్ల పంపిణీ అనంతరం మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు(Chandrababu)తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌, చంద్రబాబు మధ్య సరదా సంభాషణ జరిగింది.

Published : 01 Jul 2024 15:04 IST

గతంలో పరదాల సీఎంను మనం చూశామని.. ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) అన్నారు. పింఛన్ల పంపిణీ అనంతరం మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు(Chandrababu)తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌, చంద్రబాబు మధ్య సరదా సంభాషణ జరిగింది. ‘‘ఈ ప్రభుత్వంలో 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు. చరిత్ర గుర్తు పెట్టుకోవాలి. నువ్వు కూడా అప్పట్లో కుర్రాడివి. నీకు కూడా ఐడియా లేదు. అప్పట్లో హైదరాబాద్‌ నుంచి బయల్దేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్‌ అలర్ట్‌ ఉండేది’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం, మంత్రి లోకేశ్‌ మధ్య సంభాషణ జరుగుతున్న సమయంలో సభలో నవ్వులు పూశాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు