CM Chandrababu: పోలవరంపై శ్వేతపత్రం సిద్ధం.. నేడు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరంపై ఏపీ ప్రభుత్వం నేడు శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఏడు ప్రభుత్వశాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదల చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Updated : 28 Jun 2024 14:59 IST

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. 7 ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదలకు కూటమి ప్రభుత్వం నిర్ణయించినందున పోలవరంపై తొలి శ్వేతపత్రాన్ని ప్రజల ముందు ఉంచనున్నారు. అసలు వైకాపా హయాంలో పోలవరంలో విధ్వంసం ఎలా జరిగింది? రివర్స్ టెండర్ల మాటున జరిగిన అవినీతి, అక్రమాలపై ఆధారాలతో సహా వాస్తవాలను బహిర్గతం చేయనుండటంతో ఉత్కంఠ నెలకొంది.

Tags :

మరిన్ని