CM Chandrababu: సీమాకు పింఛన్‌.... ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు

బంగారు తల్లి సీమా పర్వీన్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. విభిన్న ప్రతిభావంతురాలైన సీమా పర్వీన్‌కు విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చిందనే సాకుతో గత వైకాపా సర్కార్ ఫించన్ తొలగించింది. నాటి మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగినా ఆమెకు న్యాయం జరగలేదు. కూటమి ప్రభుత్వం రాగానే ఫించన్ పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Published : 01 Jul 2024 17:47 IST

బంగారు తల్లి సీమా పర్వీన్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. విభిన్న ప్రతిభావంతురాలైన సీమా పర్వీన్‌కు విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చిందనే సాకుతో గత వైకాపా సర్కార్ ఫించన్ తొలగించింది. నాటి మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగినా ఆమెకు న్యాయం జరగలేదు. 2023 ఎన్నికల ప్రచారంలో భాగంగా మచిలీపట్నం వచ్చిన చంద్రబాబును.. సీమా కుటుంబసభ్యులు కలిశారు. విభిన్న ప్రతిభావంతురాలైన సీమా ఫించన్ తొలగించడానికి మనసెలా వచ్చిందంటూ గత ప్రభుత్వాన్ని బాబు నిలదీశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఫించన్ పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మాట నిలబెట్టుకుంటా అంటూ బాధితురాలుతో సెల్ఫీ దిగి అప్పట్లోనే ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.

Tags :

మరిన్ని